Andhra
సీయం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కలెక్టర్..
దోర్నాల: ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్స్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయనున్న నేపథ్యంలో హెలిప్యాడ్, సభ ఏర్పాటు నిమిత్తం గంటవానిపల్లి మరియు ప్రాజెక్టు టన్నెల్ ప్రదేశాలను సందర్శించి ముందస్తు ఏర్పాట్లను మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు లతో కలసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.
జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ శివ రామిరెడ్డి, కనిగిరి ఆర్డీఓ కేశ వర్ధన్ రెడ్డి, వై పాలెం నియోజక వర్గం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
![]()
