Connect with us

Andhra

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న కంభం ముస్లిం యూత్..

Published

on

కంభం: ప్రకాశం జిల్లా కంభం ముస్లిం యూత్ కమిటీ ఆధ్వర్యంలో కంభం పట్టణంలో “Say No To Drugs” అనే నినాదంతో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. ఈ అవగాహనా పోస్టర్‌ను ఎం.ఈ.ఓ (M.E.O)-1 సత్తార్, ఎంఈఓ_2 శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ సత్తార్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కంభం ముస్లిం యూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. సమాజంలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని ముస్లిం యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.