World
ఖలీదా జియా కుటుంబాన్ని కలిసిన ఎస్ జైశంకర్..
ఢాకా: ఢాకాలో ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ను ఎస్ జైశంకర్ కలిసిన ఫోటోను బంగ్లాదేశ్ భారతకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. గత 17ఏళ్లుగా బ్రిటన్లో ఉంటున్న ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కు ఐదు రోజుల ముందు వచ్చారు. మంగళవారంనాడు ఖలీదా జియా మరణించారు.
బంగ్లాదేశ్తో భవిష్యత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎస్. జైశంకర్ ఢాకా పర్యటన ఒక మార్గంగా. జైశంకర్ పర్యటనను భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ మంచి దౌత్యపరమైన చొరవగా అభివర్ణించారు.
బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అత్యంత బలమైన పార్టీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఫిబ్రవరి తర్వాత బంగ్లాదేశ్ పాలన ఎవరి చేతుల్లో ఉంటుందో, వారితో మంచి సంబంధాలు కలిగిఉండటం భారత్కు కీలకంగా మారింది.
![]()
