Andhra
రోగులకు పండ్లు పంపిణీ చేసిన మహబూబ్ వలి..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి సందర్శించి రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. 105 అవార్డులు వివిధ రంగాల ద్వారా తీసుకున్నట్లు మరియు విజయవాడలో తీసుకుపోయే అవార్డు కంపియన్షిప్ కమ్యూనిటీ మేక్ చేంజర్ అవార్డు 106వ వార్డు అని తెలిపారు. తనకు సామాజిక రంగంలో ఎనిమిది డాక్టర్ అవార్డులు పొందానని మరియు అనేక రంగాల ద్వారా 10 డాక్టరేట్ అవార్డులు స్వీకరించానని తెలిపారు. ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలని డాక్టర్ షేక్ మహబూబ్ వలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు స్నేహితులు పాల్గొన్నారు.
![]()
