Andhra
కొత్త రకం వరి… ఆరుసార్లు కోత
ఒక కొత్త రకం వరి వంగడాన్ని చైనా శాస్త్రవేత్తలు (China scientists) అభివృద్ధి చేశారు. దీనిని చైనా (China)కు చెందిన సాధారణ రకం ఒర్జ్యా సతివా రకం వరిని, ఆఫ్రికాకు చెందిన మరో రకం వరిని సంకరం చేసి ‘పీఆర్-23’ని అభివృద్ధి చేశారు. ఈ రకం వరిని ఒక్కసారి నాటితే ఆరు సార్లు కోతకు వస్తోందంట. దీనిని చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ శాస్త్రవేత్తలు ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అనే అభివృద్ధి చేశారు. ఈ వంగడాన్ని ఒక్కసారి నాటితే, మూడేళ్ల పాటు వరుసగా ఆరు సీజన్ల వరకు పంట దిగుబడిని పొందవచ్చు. ఎకరాకు సుమారుగా రెండు టన్నుల వరి పండుతుంది. అంతేకాదు కూలీల సమస్య ఉండదు. పంటకు అయ్యే ఖర్చులు కూడా తక్కువే. ఎందుకంటే ఒక్కసారే నాటు వేస్తారు. విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వరిని 17 దేశాలతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
![]()
