Andhra
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని పరమార్శించిన ఎమ్మెల్యే కందుల..
పొదిలి: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన యువకులు గణేష్ (20), అబినాష్ (22) నిన్న రాత్రి కొనకనమిట్ల మండలంలోని ఎదురాళ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. పొదిలి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారి భౌతిక కాయాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు.
![]()
