Andhra
పేకాట ఆడుతున్న ముగ్గురి అరెస్టు, నగదు స్వాధీనం.. ఎస్ఐ ఎమ్ సైదుబాబు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసిన మార్కాపురం పట్టణ ఎస్ఐ ఎమ్ సైదుబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై రైడ్ చేస్తున్నామని, అందులో భాగంగా పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద 50,040 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం మరియు పేకాట ఆడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎమ్ సైదుబాబు హెచ్చరించారు.
![]()
