Andhra
గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి స్వామి..
ప్రకాశం జిల్లా కొనకొనమిట్ల మండలంలోని గార్లదిన్నే లోని డాక్టర్. బి. ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి, చదువు గాలి జరుగుతుందని విచారించారు. అలాగే విద్యార్థులతో వారి సమస్యల గురించి నేరుగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం టిడిపి ఇంఛార్జి ఎరిక్షన్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణ, కొప్పుల శ్రీనివాసులు, పఠాన్ ఇబ్రహీం ఖాన్, ఎస్టేట్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
![]()
