Andhra
వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి, సముద్రంలో మునిగి ఇద్దరి మృతి..
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండాల మాల సముద్రతీరంలో వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమాలలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనా కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సముద్రంలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను మెరైన్ పోలీసులు సముద్ర నుంచి వెలికి తీశారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులు మోటుమాలకి చెందిన నాగరాజు, పాలచందర్గా గుర్తించారు.
![]()
