Andhra
ఎరువుల దుకాణం దారులు అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం..సీఐ సుబ్బారావు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు యూరియా ఎరువు మందుల అక్రమ నిల్వల నేపద్యంలో మార్కాపురం సీఐ పి సుబ్బారావు ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా సిఐ ఆయా షాపుల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్న లేక ప్రభుత్వ ధరలకు ఎక్కువ రేట్లకు అమ్మి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐ పి. సుబ్బారావు వెంట పట్టణ ఎస్ఐ ఎమ్. సైదుబాబు కూడా ఉన్నారు.
![]()
