Andhra
ప్రతి గర్భిణీ స్త్రీ తప్పక పోషకాహారం తీసుకోవాలి
భారతదేశంలో, సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారంగా జరుపుకుంటారు. ఈ వారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మరియు పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలలో అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు.ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన హోప్ విన్ హాస్పిటల్ చైర్ వుమన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి, ప్రతి గర్భిణీ స్త్రీ పోషకాహారం అనేది అత్యంత ముఖ్యమైనది అని, పోషకాహారం లోపిస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి సమతుల ఆహారం తీసుకోవాలని ఆమె చెప్పారు.రోజువారి జీవితంలో ఆహారంలో పోషకాలనందించే మాంసకృత్తులు, పిండిపదార్థాలు కొవ్వు, పీచు పదార్థాలు విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు సరైన మోతాదులో తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి అని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.
![]()
