Andhra
ఇక విజయవాడ నుంచే హజ్ యాత్ర.. చంద్రబాబును కృతజ్ఞతలు తెలిపిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
AP: రాష్ట్రంలోని ముస్లింలు సులువుగా, సునాయాసంగా పవిత్ర స్థలం మక్కాకు చేరుకునే అవకాశం ఏర్పడింది. నేరుగా మక్కాకు చేరుకునేందుకు వీలుగా దేశవ్యా ప్తంగా ఎంబార్కేషన్ పాయింట్లు కలిగిన 17 అంతర్జాతీయ విమానాశ్రయం యాల జాబితాలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పా టుతో హజ్ యాత్ర చేసే ముస్లింలకు వేలాది రూపాయల డబ్బు, సమయం ఆదా కానున్నాయి. ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు పట్ల సీఎం చంద్రబాబుకు, మంత్రి ఫరూక్ కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, హజ్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
![]()
