Andhra
అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని పనిచేద్దాం: రుస్తుంబాబు
శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా గుజ్జనగుళ్లలోని అబ్దుల్ కలాం సెంటర్ నందు గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ రుస్తుంబాబు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు దేశ సేవ చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ మీరవలి, వెల్డింగ్ అలీ, అవాజ్ కమిటీ భాషా, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
![]()
