Andhra
కంభంలో విద్యార్థి ఆత్మహత్య..
ప్రకాశం జిల్లా కంభంలో కంచాల అంజనీ కమల్ (18) అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కమల్ జేఈఈ లో కోచింగ్ తీసుకొని చదువుతానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ తమిళనాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉచితంగా సీటు రావడంతో పాలిటెక్నిక్ చదవాలని కుటుంబ సభ్యులు కమల్ కు తెలిపారు. పాలిటెక్నిక్ చదవడం ఇష్టం లేని కమల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహన్ని తరలించిన పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]()
