Andhra
గుంటూరు తూర్పు ప్రజలకు శుభవార్త! నందివెలుగు ఫ్లైఓవర్ జూలై 19 న పనులు ప్రారంభం
నందివెలుగు ఫ్లైఓవర్ పనులు ప్రారంభం జూలై 19న తిరిగి ప్రారంభం కానున్నాయి అని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ షాట్ న్యూస్ కు తెలిపారు. గుంటూరు ప్రజలకు అవాంతరాలు లేకుండా, సమర్థవంతమైన రవాణా అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని ప్రజల సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేయడం మా ప్రభుత్వానికి ప్రాధాన్యంగా ఉందిఅని,2014-19లో తెలుగు దేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. మరల తమ ప్రభుత్వమే ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అందిస్తుందని ఆయన తెలియజేశారు. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ పనులు పూర్తిగా ఆగిపోయాయి.ఒక్క ఇటుక కూడా వేయలేదుఅని పునఃప్రారంభానికి కావలసిన నిధులను ముఖ్యమంత్రి ,కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని మద్దతుతో 6 నెలల సమయం లో పనులు పూర్తిచేసేలా స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేశాం అని,ఈ మార్గంలో ప్రజల కష్టాలను దూరం చేస్తామని తెలియజేశారు.
![]()
