Connect with us

Andhra

“మట్టిలో చేతులు – హృదయంలో దేశం” ఉద్యమంలో భాగంగా చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ర్యాలీ..

Published

on

చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. దీని పేరు “ మట్టిలో చేతులు– హృదయంలో దేశం” నినాదంతో 2025 జూన్ 25 నుంచి జూలై 26 వరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలతో 10 లక్షల చెట్లు నాటించి వాటిని సంరక్షించడమే లక్ష్యంగా మార్కాపురం స్ధానిక చిన్న మసీదు ప్రాంగణం నుండి కోర్టు సెంటర్, మెయిన్ బజార్ వరకు సేవ్ ట్రీ- సేవ్ ఎర్త్ వంటి పలు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా నాయకులు మాట్లాడుతూ.. ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత వంటి విలువలు బాల్యంలోనే అలవడాలని విశ్వసిస్తుందని, చెట్లు నాటడం ద్వారా పిల్లల్లో దేశభక్తి, పర్యావరణ భద్రత, సేవా భావం పెరుగుతాయని, చెట్టు నాటినప్పుడు అది పిల్లలకు జీవితాంతం బాధ్యత, ప్రేమ, సహనతను నేర్పే ఒక గొప్ప పాఠమవుతుందని, ఈ ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా  పిల్లలు తమ పాఠశాలలు, మదర్సాలు, మసీదులు, పార్కులు మరియు ఇంటి ముందు మొక్కలు నాటుతాము అని అన్నారు. చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సిఐఓ) అనేది చిన్నారుల కోసం, చిన్నారుల ద్వారా, పెద్దల పర్యవేక్షణతో నడిచే జాతీయ స్థాయి సంస్థ. ఇది ఇస్లామిక్ విలువల ఆధారంగా పిల్లల్లో మంచి నైతికత, విద్యా శ్రేష్టత, సామాజిక చైతన్యం  ఈ కార్యక్రమంలో CIO పట్టణ అధ్యక్షురాలు తస్లీమా, GIO పట్టణ అధ్యక్షురాలు సుమయ్య, జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షురాలు షాహెదా, పఠాన్ ఆయెషా, షేక్ ఆయెషా, మాలిన్, సర్తాజ్, CIO పిల్లలు పాల్గొన్నారు.చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. దీని పేరు “ మట్టిలో చేతులు– హృదయంలో దేశం” నినాదంతో 2025 జూన్ 25 నుంచి జూలై 26 వరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలతో 10 లక్షల చెట్లు నాటించి వాటిని సంరక్షించడమే లక్ష్యంగా మార్కాపురం స్ధానిక చిన్న మసీదు ప్రాంగణం నుండి కోర్టు సెంటర్, మెయిన్ బజార్ వరకు సేవ్ ట్రీ- సేవ్ ఎర్త్ వంటి పలు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా నాయకులు మాట్లాడుతూ.. ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత వంటి విలువలు బాల్యంలోనే అలవడాలని విశ్వసిస్తుందని, చెట్లు నాటడం ద్వారా పిల్లల్లో దేశభక్తి, పర్యావరణ భద్రత, సేవా భావం పెరుగుతాయని, చెట్టు నాటినప్పుడు అది పిల్లలకు జీవితాంతం బాధ్యత, ప్రేమ, సహనతను నేర్పే ఒక గొప్ప పాఠమవుతుందని, ఈ ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పిల్లలు తమ పాఠశాలలు, మదర్సాలు, మసీదులు, పార్కులు మరియు ఇంటి ముందు మొక్కలు నాటుతాము అని అన్నారు. చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సిఐఓ) అనేది చిన్నారుల కోసం, చిన్నారుల ద్వారా, పెద్దల పర్యవేక్షణతో నడిచే జాతీయ స్థాయి సంస్థ. ఇది ఇస్లామిక్ విలువల ఆధారంగా పిల్లల్లో మంచి నైతికత, విద్యా శ్రేష్టత, సామాజిక చైతన్యం ఈ కార్యక్రమంలో JIH మహిళా విభాగం అధ్యక్షురాలు సయ్యద్ తబస్సుమ్, CIO పట్టణ అధ్యక్షురాలు తస్లీమా, GIO పట్టణ అధ్యక్షురాలు సుమయ్య, జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షురాలు షాహెదా, పఠాన్ ఆయెషా, షేక్ ఆయెషా, మాలిన్, సర్తాజ్, CIO పిల్లలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.