Andhra
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న తహశీల్దార్ చిరంజీవి..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట గ్రామ సర్వే నెం.71లో ప్రభుత్వ కుంట భూమిలో 0.30 సెంట్ల భూమిని ఆక్రమించిన ముంగమూరి బాదరయ్యపై తహశీల్దార్ చర్యలు తీసుకున్నారు. గతంలోనూ అక్రమ నిర్మాణం తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరలా జరిగిన ఆక్రమణను తహశీల్దార్ ఆద్వర్యంలో సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించింది. బాదరయ్యపై క్రిమినల్ కేసు నమోదు కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఈ తొలగింపులో తహసీల్దార్ చిరంజీవి, సర్వేయర్ సంజీవయ్య, వీఆర్వో గాలిబు, గ్రామ సర్వేయర్ టింకు పాల్గొన్నారు.
![]()
