Andhra
టోపీ బాబును ఘనంగా సన్మానించిన ఏపీడబ్ల్యూజేఎస్
ముస్లిం ఐక్య వేదిక గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా సయ్యద్ మోహిబ్ అలియాస్ టోపీ బాబు నియమితులైన సంగతి తెలిసిందే,సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ముస్లిం సోదరుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో టోపీ బాబు తపన చాలా మందికి స్ఫూర్తిదాయకం.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర నేతలు ఆయనకు గుంటూరులో ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా మాట్లాడుతూ టోపీ బాబు లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని ఆయన సేవలను కొనియాడారు. టోపీబాబు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరుకున్నారు.
![]()
