Andhra
జగన్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
AP: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని చెప్పారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సినిమా డైలాగులను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఈ మేరకు పోలీసులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘీక శక్తులను అదుపు చేస్తామని వెల్లడించారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
![]()
