Andhra
కట్న, కానుకలు లేని వివాహాలు చేసుకొని జమాతే ఇస్లామీ క్యాడర్ సమాజానికి ఆచరించి చూపాలి: రాష్ట్ర అధ్యక్షులు షౌకత్ ఫహీం
గుంటూరులో కట్న కానుకలు లేని వివాహం (ఆదర్శ వివాహం SIO యువకుడి పెళ్లి) ఈరోజు గుంటూరులోని అబ్దుల్ కలాం షాదీ ఖానా లో జరిగింది. ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైన జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షౌకత్ ఫహీం నిఖా ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పెళ్ళి చేయటం ఒక భారంగా ఆడపిల్ల తల్లిదండ్రులు భావిస్తున్నారని, ఉన్నత విద్యను అభ్యసించిన ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం కూడా భారంగా పరిస్థితులు మారిపోయాయని, కాబట్టి జమాత్ క్యాడర్,SIO యువకులు ముందుకు వచ్చి కట్నకానుకలు లేని, దుబారా ఖర్చులేని వివాహాలు చేసుకొని, సమాజానికి చూపి ముస్లింలందరికి ఆదర్శంగా నిలబడాలని పిలుపు ఇచ్చారు.
![]()
