Andhra
ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు సదుపాయాలు పెంచాలి..మల్లిక్
మార్కాపురం: జాతీయ వినియోగదార్ల వారోత్సవాల సందర్భంగా నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన వినియోగదార్ల సదస్సులో ఆర్టిసి డిపో మేనేజర్ నరసింహులు అదక్షత వహించారు.
ముఖ్య అతిధిగా జిల్లా వినియోగదార్ల సంఘాల అధ్యక్షులు ఓరుగంటి మల్లిక్ పాల్గొని ప్రసంగిస్తూ.. బస్టాండ్ లో సలహాలు మరియు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేయాలని మరియు బస్సు వేళలను ఎంక్వయిరీకి టెకాన్నాలజీతో చెప్పే విధానం ఏర్పాటు చేయాలని, అలాగే బస్టాండ్ లో వసతులు కల్పించాలని, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రయానీకుల సంఘ అధ్యక్షులు ఆర్కేజీ నారసింహం, బిజేపి నాయకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
![]()
