Andhra
కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లల మృతి..మొద్దు నిద్ర పోతున్న మున్సిపల్ అధికారులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా పట్టణంలోని చెన్నరాయుని కానీపల్లిలోని 14 వ వార్డ్ లో కుక్కలు గొర్రపిలల మందలో దూరి కరవటంతో నిన్న ఒక 6 గొర్రపిల్లలూ, నేడూ ఒక 14 గొర్రపిల్లలూ చనిపోయాయి. ఇలా ప్రతి రోజు నోరులేనీ మూగజీవాలనూ హింసంచి, కరుస్తున్నాయి కుక్కలు. ఇప్పటికే మనుషుల్ని కరుస్తూ.. భీత వాతావారణాన్ని సృష్టిస్తున్న వీధి సింహాలు.. ఇప్పుడు మూగ జీవలను చూపుతున్నాయి.
మార్కాపురం పట్టణంలోని అన్ని వార్డులలో ఇదే పరిస్థితి, మున్సిపల్ నిర్లక్ష్యానికి చాలా మంది బాధపడుతున్నారు. రాత్రి సమయంలో అవసరాల నిమిత్తం బయటకు పోయి ఇండ్లకు పోవాలంటే హడలిపోతున్న పట్టణ ప్రజలు. మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారంటూ ప్రజలు చీదరించుకుంటున్నారు.
![]()
