Andhra
నిబంధనలు ఉల్లంఘిస్తున్న రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలి.. MPJ
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మరియు మండలంలో రేషన్ డీలర్లు ఒకటవ తారీకు నుంచి 15వ తేదీ వరకు బియ్యం, చక్కెర మరియు సరుకులు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ షాపులు తెరిచి ఉంచాలనే నియమం ఉన్నప్పటికీ, రేషన్ డీలర్లు 8వ తేదీ వరకు సరుకు ఇచ్చి స్టాక్ లేదని స్టాక్ అయిపోయిందని చెప్పడం జరుగుతుందని, కావున డిప్యూటీ తాహసిల్దార్ డీలర్లతో సమావేశం ఏర్పరిచి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు ఖచ్చితంగా ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని ప్రొద్దుటూరు ఎంపీజే శాఖ డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాష, జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి, పట్టణ కార్యదర్శి రఫిక్. సభ్యులు ఎస్పీ ముక్తియార్, సాబీర్ తదితరులు పాల్గొన్నారు.
![]()
