Andhra
ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షుబ్లిని అభినందనలు తెలిపి, ఉమ్మిద్ పోర్టల్ గడువును పెంచాలని కోరిన MPJ..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన ముహమ్మద్ ఫారూఖ్ షుబ్లికు అభినందనలు తెలిపిన మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వఖ్ఫ్ బోర్డు వారు వక్ఫ్ ఆస్తులను నమోదు చేయుటకు ఉమ్మిద్ పోర్టల్ డిసెంబర్ 5వ తేది వరకు సమయం ఇచ్చారని, అయితే పోర్టల్ టెక్నికల్ సమస్యల వలన సరిగా పనిచేయక పోవడం, చాలా మంది మస్జిద్ ముతవల్లీలకు సరైన అవగాహన లేకపోవడంతో వక్ఫ్ ఆస్తులను నమోదు గడువును పెంచాలని వారు కోరారు. ఈ విషయాన్ని ఏపి సీయం దృష్టికి తీసుకొని వెళ్ళి సమయాన్ని ఒక నెల రోజుల పాటు పెంచాలని వారు కోరారు.
![]()
