Andhra
ప్రకాశంలో అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్ళిన బాలింత..
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణీ స్త్రీ, ఆసుపత్రి వాష్రూమ్ వద్ద బిడ్డకు జన్మనిచ్చి, ఆ శిశువును బకెట్లో పడేసి పరారైంది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
![]()
