Andhra
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉందని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. నిత్యం ప్రయాణికులు తిరిగుతూ రద్దీగా ఉండే ప్రాంతంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంపై ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
![]()
