Andhra
ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్ షిప్ రద్దు.. సబ్ కలెక్టర్
మార్కాపురం: ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, మరియు డీలర్లకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్ షిప్ రద్దుచేసి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్, తాసిల్దార్ చిరంజీవి, పట్టణ ఎస్ఐ సైదుబాబు, వ్యవసాయ ఏవో బుజ్జి భాయి తదితరులు పాల్గొన్నారు.
![]()
