Andhra
మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచిన ప్రభుత్వం..
గత కొద్ది రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చేస్తున్న సమ్మె విరమించారు. వేతనాలు పెంచుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ వర్కర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500, కేటగిరీ -2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ-3 వర్కర్లకు రూ.15,000 నుంచి రూ.18.500కు పెంచింది. దీంతో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించనున్నారు.
![]()
