Andhra
మెయిన్ రోడ్డులో తీసిన చెత్త ఎత్తివేయాలి..
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ మెయిన్ బజార్ లో గత మూడు రోజులుగా మురికి కాలువలో తీసిన చెత్తను తీయకపోవడంతో షాపులకు అడ్డంగా ఉన్నందున షాపులకు ఎవరు రాకపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. రహదారి వెంట వెళ్లే పాదచారులు దుర్వాసనతో ముక్కలు మూసుకుని వెళ్లవలసి వస్తుంది. పట్టణంలోని మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను ఎత్తివేసెందుకు కాంట్రాక్టర్ కు అప్పజెప్పిన మున్సిపాలిటీ. వెంటనే మెయిన్ బజార్ లో తీసిన చెత్తను తొలగించాలని పాదచారులు, షాపు యజమానులు కోరుతున్నారు.
![]()
