Andhra
తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే అన్నా..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుండ్లకమ్మ ఉదృతంగా ప్రవహించటంతో వేములకోట, పెద్దనాగులవరం గ్రామాలతో పాటు పట్టణంలోని చెరువుకు వరద నీరు వచ్చే కాలువ పరివాహక ప్రాంతాలైన 16, 17, 18 వార్డులో స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీలను పర్యటించిన మాజీ ఎమ్మెల్యే, వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నా రాంబాబు. వారితో పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, 17, 18 వ వార్డుల ఇంఛార్జిలు షేక్ కరీముల్లా, సయ్యద్ గఫూర్ తదితర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
