Andhra
పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం ర్యాలీ నిర్వహించిన పోలీసులు..
మార్కాపురం: అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీసులు, విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనీ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎండ అనక వాన అనక పోలీసులు తమ బాధ్యతలను నెరవెర్చినందునే సమాజంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సెహధిత్ వెంకట త్రివినాగ్, డీఎస్పీ యు నాగరాజు, సీఐ పి సుబ్బారావు, పట్టణ, గ్రామీణ ఎస్ఐలు ఎమ్ సైదుబాబు, పి అంకమ్మ రావు, బీజేపీ ఇంచార్జి కృష్ణారావు, ఏఎంసి చైర్మన్ వెంకట రెడ్డి, టిడిపి నాయకులు గుంటక సుబ్బారెడ్డి, షెక్షావలి, డాక్టర్ మౌలాలి, పఠాన్ ఇబ్రహీం ఖాన్, విద్యార్థులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
![]()
