Andhra
భార్యని హింసించిన కేసులో నలుగురి అరెస్టు..సీఐ వెంకటేశ్వర్లు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామం ఎస్సీ కాలనీలో భాగ్యలక్ష్మిని ఆమె భర్త బాలాజీ హింసించిన ఘటనలో పోలీసులు భర్త బాలాజీతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందని సిఐ అన్నారు. మద్యానికి బానిసైనా బాలాజీ వేరొక స్త్రీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని భార్యను డబ్బు కోసం వేధించేవాడని సీఐ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మ నాయుడు పాల్గొన్నారు. భార్యను భర్త తన రెండు చేతులను దూలానికి కట్టేసి చావబాదిన వీడియో వైరల్ అయిన సంగతి పాఠకులకు విదితమే.
![]()
