Andhra
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్ కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. గురువారం ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
నాదేండ్ల భాస్కర రావు 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజులపాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
![]()
