Uncategorized
నేడు వైసిపి ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు.. ఎస్ఐ M సైదుబాబు
మార్కాపురం: మార్కాపురం సబ్ డివిజనల్ పరిధిలో డిఎస్పీ ఆదేశాల మేరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అనుమతులు లేకుండా ఎలాంటి సభలు గానీ, ర్యాలీలు చేయరాదు. నేడు మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎలాంటి అనుమతులు ఇవ్వనందున, ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీ, సభలు గానీ మార్కాపురం పట్టణ పరిధిలో నిర్వహించరాదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కావున చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకుండా అందరూ సహాకరించాలని మార్కాపురం పట్టణ ఎస్ఐ M సైదుబాబు ప్రకటనలో తెలిపారు.
![]()
