War
ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడి..
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని లేదంటే ఈ రాత్రే ఇరాన్ కు చివరిది అవుతుందని చెప్పి గడువుకు కొన్ని గంటలకు ముందే యుద్ద నీతికి వ్యతిరేకంగా ఇరాన్ లోని మౌలిక సదుపాయాలైన విద్యుత్, రైల్వే స్టేషన్లు, నీటి సరఫరా మొదలైన వాటిపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు, మిసైల్లతో నాశనం చేస్తున్నాయి. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎదురు దాడి చేసి వాటి మౌలిక సదుపాయాలను దాడి చేసి నాశనం చేయబోతుంది. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేయడానికి కోటిన్నర మంది తనతో సహా ఇరాన్ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
పాకిస్థాన్, ఈజిప్టు, టర్కీ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక యుద్ధ విరమణకు అమెరికా ప్రయత్నాలు చేయగా శాశ్వత యుద్ధ విరమణకు ఇరాన్ మొగ్గు చూపింది. దీంతో ఈరోజు రాత్రి ఇరాన్ భూమి మీద లేకుండా చేస్తానని ట్రంప్ చెప్పడం దాడులు ముమ్మరం చేయడం గమనార్హం.
![]()
