India
దక్షిణ నేతను ఎంపిక చేసి బిజేపి కు ఝలక్ ఇచ్చిన ఇండియా కూటమి..
దేశ రాజకీయాల్లో ఉప రాష్ట్రపతి అంశం ఆసక్తిని రేపుతోంది. ఎన్డీయే కూటమి తరపున తమిళనాడుకు చెందిన దళిత నేతను ఎంపిక చేసే ఆలోచన చేస్తుంది. ఎన్డీఏ తరపున ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారు అయింది. దీంతో ఇండియా కూటమి ఎవరిని పోటీలోకి దింపబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే రాజ్యసభసభ్యుడు తిరుచ్చి శివను ఎంపికే చేసేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సౌత్ ఇండియా సెంటిమెంట్ అస్త్రంగా తమిళనాడుకు చెందిన ఒడిసి కు చెందిన రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతున్న వేళ అదే తమిళనాడుకు చెందిన దళిత ఎంపి తిరుచ్చి శివను రంగంలోకి దింపడం ద్వారా ఎన్డీయే కూటమికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
![]()
