India
“ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరే పవిత్రం”…ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు
ఉత్తర్ ప్రదేశ్ లోని మధురకు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారని ఆయన అన్నారు. అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఈ మేరకు అమ్మాయిలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం.. అని మిగతా వారంతా తమ బాయ్ ఫ్రెండ్స్ తో అఫైర్స్ లో బిజీగా ఉంటున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న రాకాలుగా స్పందిస్తున్నారు.
![]()
