Connect with us

weather

దేశంలో జోరుగా వర్షాలు

Published

on

రుతుపవనాల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈ నెల 15న భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్​గఢ్, బీహార్, మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఐఎండీ యెల్లో అలర్ట్​ జారీ చేసింది. మరీ ముక్యంగా రాజస్థాన్​లో ధూళి తుపాను, పంజాబ్, హరియాణాలో వడగాలులు, బిహార్​లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తాలోని కారైకల్​లో అతి భారీ వర్షాలు (>20 సెం.మీ/ 24 గంటలు) కురిసే అవకాశం ఉంది. జూన్ 16 వరకు కేరళ అండ్ మాహేలో వర్షాలు పడతాయి,” అని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో వివరించింది.

ఈ రోజు, రేపు గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 17 నుంచి 19 వరకు గుజరాత్​లో, జూన్ 20 వరకు మధ్యప్రదేశ్​లో, జూన్ 18 నుంచి 20 వరకు ఛత్తీస్​గఢ్​లో, జూన్ 17, 18 తేదీల్లో ఝార్ఖండ్​లో, మరో రెండు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కేరళలో కురిసిన భారీ వర్షాలకు చెట్లు నేలకూలడం, వీధులు, రోడ్లు జలమయం కావడం, ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన ఈదురుగాలులతో ఉత్తర జిల్లాల్లోని హై రేంజ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి తీరం వెంబడి శివారు ప్రాంతమైన వేటుకాడులో ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల పరిస్థితి త్వరలో తగ్గుముఖం పడతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. వాయవ్య భారతం, హిమాలయాల్లో కొన్ని రోజులుగా వడగాలులు వీస్తున్నాయని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.